నెక్కొండ సిఐ హతి రామ్, ఎస్సై జానీ పాషా
#నెక్కొండ ,నేతి ధాత్రి: ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వాట్సాప్ గ్రూప్ మరియు ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా చేసే పోస్ట్లు ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదని ఎవరి పట్ల నైనా అసభ్య ప్రవర్తన వైఖరితో మాధ్యమాలలో మెసేజ్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరు కూడా విద్వేషాలకు వివాదాలకు దారి తీసే అసభ్యమైన మెసేజ్లు చేయకూడదని సోషల్ మీడియా వ్యక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సోషల్ మీడియా గ్రూపు అడ్మిన్లు, సోషల్ మీడియా వర్కర్లు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు .