గ్రామాలలో కలిస్తే గెలుస్తాం..నిలుస్తాం
బిసా రమేష్,తాళ్ళ రవి ముదిరాజ్
నేటిధాత్రి:
ముదిరాజ్ ల జాతి అభివృద్ధి కోసం విద్యా,ఉద్యోగం,సాధికారత లక్ష్యంగా అడుగులు వేద్దామని అవిశ్రాంతంగా ముదిరాజ్ కుల బంధువుల అభ్యున్నతికి పాటుపడుతున్న మెపాకు సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక రాజకీయ సామాజికతలో ముదిరాజ్ ల వెనుకబడి ఉన్నారని విద్యతోనే అభివృద్ధి సాధ్యమని మెపా చేస్తున్న ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుగా అన్ని రంగాలలో ముదిరాజ్ లు రాణించేలా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మెపా అభివృద్ధికి విస్తరణకు మూలాలలోకి వెళ్తూ గ్రామ గ్రామాన కలిస్తే గెలుస్తాం.. నిలుస్తాం అని మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిసా రమేష్ ముదిరాజ్,మెపా రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ రవి ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ ముదిరాజ్ లకు చైతన్య కార్యక్రమాలు,విద్యతో అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి కాబట్టి ముదిరాజ్ యువత విద్య,ఉద్యోగ అవకాశాల వైపు రాజకీయ సాధికారతవైపు అడుగులు వేసేందుకు ముదిరాజ్ లు ఒక తాటిపైకి వచ్చి పూర్తిస్థాయిలో కలిసికట్టుగా సహకరిద్దామని తెలియజేశారు.