ప్రజలకు ఆచరణ యోగ్యంగా మేనిఫెస్టో విడుదల.
భూపాలపల్లి నియజవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం..
ఒక్క ఓటు వేస్తే 5ఏళ్ళు సేవకుడిగా పనిచేసిన…
మళ్ళీ సమయం ఆసన్నమైంది ప్రజలందరూ ఆశీర్వదించాలి…
ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
చిట్యాల,నేటిధాత్రి ;
ప్రజల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, సాగుతున్న అభివృద్ధి,సంక్షేమం కొనసాగలంటే మల్లి భారత రాష్ట్ర సమితి కిఓటు వేయాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణ రెడ్డి అన్నారు మంగళవారం రోజున చిట్యాల మండలం వెంచరామి, అందుకుతండా, చైన్ పాక,వరికోల్ పల్లి,నైన్ పాక గ్రామలలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వెంచరామి గ్రామం నుంచి ఎమ్మెల్యే గండ్ర గెలుపు కోసం మేము సైతం అను దాదాపు 50 మంది కాంగ్రెస్ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో చేరారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…
రాజ్యంగా బద్దంగా 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు అనివార్యం.
5ఏళ్ళల్లో ప్రజల కోసం పనిచేసే నాయకులు ఎవరో ప్రజలు ఆలోచించాలి.
గడిచిన 10 ఏళ్లలో మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను దాదాపు పూర్తి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.
రాబోయే 5ఏళ్లకు ఎం చేస్తామో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మ్యానిఫెస్టోలో విడుదల చేశారు.
కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మ్యానిఫెస్టో ఇది.
సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారిన మ్యానిఫెస్టో ఇది.
తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మ్యానిఫెస్టో ఇది. పింఛన్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మ్యానిఫెస్టో ఇది.
అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించే మ్యానిఫెస్టో ఇది
అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మ్యానిఫెస్టో ఇది. ఇది బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో మాత్రమే కాదు. ప్రజల మ్యానిఫెస్టో.
ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మ్యానిఫెస్టో.
తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.
విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా..
ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు.
అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే..
ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి.
సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ తో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. రికార్డ్ సృష్టించబోతున్నది.బి ఆర్ ఎస్ మేనిఫెస్టో తో ప్రతిపక్ష పార్టీలు గల్లంతు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గౌ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం వుంది.
ఆచరణకు అమలు అయ్యే పథకాలనుఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.