ప్రభుత్వ బడులు బాగు చెయకపొతే పేదలకు విద్య దూరమయ్యె ప్రమాదం
రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారు ఆర్.వెంకట్ రెడ్డి
నిజాంపేట నేటి ధాత్రి:
ప్రభుత్వ బడులను బాగుచేయకపొతె పేదలు,దళిత బహుజనులకు విద్య దూరమయ్యే ప్రమాదం పొంచి వున్నదని రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారులు,యంవిఎఫ్ జాతీయ కార్యదర్శి ఆర్.వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ ( డిబిఎఫ్) ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో గురువారంనాడు భారత రాజ్యాంగం హక్కులు,చట్టాలు,సామాజిక,ఆర్ధిక రాజకీయ పరిస్థితులు నాయకత్వ లక్షణాల పై శిక్షణ శిబిరం నిర్వహించారు. విద్యా హక్కులు అమలు పరిస్థితి సవాళ్ళు పరిష్కారాలు అనే అంశం పై రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ఆర్.వెంకట్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి మా భర్తలు తాగె మద్యం ద్వారా వచ్చె ఆదాయం తో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని మహిళలు సూచిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి ప్రభుత్వానికి విద్యా కమిషన్ ద్వారా సూచించామని తెలిపారు. ప్రవేట్ పాఠశాలకుదీటుగా ప్రతి మండలం నాలుగు ఆధునిక పాఠశాలలను నిర్మించాలని,ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని,ప్రవేట్ పాఠశాల ఫిజుల దొపిడిని ఆరికట్టాలని కొరమని చెప్పారు.ప్రభుత్వ విద్య పరిరక్షణకు ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత చెపట్టాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చెయాలని,ప్రవెట్ పాఠశాలలో 25 శాతం రిజర్వేషన్ లను కల్పించాలన్నారు.రాజకీయ నాయకుల,డబ్బులు వున్న వారి ధనవంతుల,పేదల పిల్లలకు సమాన విద్య ను అందించాలన్నారు.ప్రభుత్వ, ప్రవెట్ పాఠశాలలో చదువుతున్న 50 శాతం పిల్లలకు బడికి పొయిన చదువు రావడం లేదన్నారు 1960 సంవత్సరం నాటికి అందరికి విద్యను అందించాలి డాక్టర్ అంబేద్కర్ చెప్పాడని గుర్తు చేశారు.ప్రభుత్వ విద్య రక్షణకు విద్య యుద్దం ఉద్యమం చేపట్టాలన్నారు. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ నాయకత్వ లక్షణాల పై మాట్లాడుతూ బుద్దుడు పూలే అంబేడ్కర్ సిద్దాంతం వెలుగులు నాయకులు త్యాగన్ని అలవర్చుకొవాలన్నారు.నాయకులకు వినె లక్షణం వుండాలన్నారు.ఓర్పు,సహనం,నిస్వార్థాలను అలవర్చుకొవాలన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా వుండాలన్నారు.మానవత్వాన్ని పెంపొందించుకొని సమాజ మార్పు కొసం అంకిత భావంతో పని చెసె చిత్తశుద్ధి కలిగిన నాయకులుగా ఎదగలన్నారు. సమాచార హక్కు చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆయుధం లాంటి దన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొవాలన్నారు.ఉపాధి,భూమి,విద్య తదితర పధకాల అమలు పై సమాచారాన్ని తెలుసుకొవచ్చాన్నారు.ఈ శిక్షణ శిబిరాన్ని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్ సమన్వయం చేయగా, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కర్ణాకర్,సిద్దిపేట జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు,కామారెడ్డి జిల్లా నాయకులు ప్రభాకర్, బి ప్రభాకర్,మహిళ కార్యకర్త ,నిజాంపేట మండల డిబిఎఫ్ అధ్యక్షులు బ్యాగరి చంద్రం, బ్యాగరి రాజు, నాయకులు యాదుల్, నర్సింలు,రామస్వామి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు,పాటలు గ్రూపుల వారిగా పలు అంశాల పై చర్చించారు.