SGT Teachers Form New PTA in Ibrahimpatnam
ఇబ్రహీంపట్నం మండల ఉపాధ్యాయుల ఎస్ జి టి అసోసియేషన్ ఏర్పాటు
ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి
మండలంలో పనిచేస్తున్న ఎస్ జి టి ఉపాధ్యాయుల సమస్యలు మరియు హక్కుల పరిరక్షణ కోసం ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్( పి టి ఏ) ను ఏర్పాటు చేయడం జరిగింది! గత చాలా సంవత్సరాల నుండి ఎస్ జి టి ఉపాధ్యాయులకు రావాల్సిన ఎమ్మెల్సీ ఓటు హక్కు గాని, పదోన్నతులు లేకుండా ఎస్ జి టి గా పదవి విరమణ చేయడం గాని , కేవలం ప్రాథమిక పాఠశాల లోనే విద్యార్థులు నిష్పత్తి ని పరిగణలోకి తీసుకోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తూ విద్యారంగ వ్యవస్థ కోసం శ్రమ దోపిడీ కి గురవుతున్న ఎస్ జి టి ల కోసం, తమ భవిష్యత్తు కోసం వాడుకుంటున్న వివిధ ఉపాధ్యాయ సంఘాలతో విసిగి తామే ప్రత్యేకంగా ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని అధ్యక్షులు శ్రీ అల్లాడి హరి ప్రసాద్ గారు అన్నారు! ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గా అల్లాడి హరి ప్రసాద్ గారిని,ఉపాధ్యక్షులుగా శ్రేమతి సిహెచ్ వాణి , జి. విజయ లక్ష్మి ని, ప్రధాన కార్యదర్శి గా శ్రీ అల్లాడి కృష్ణ ప్రదీప్ ని, సంయుక్త కార్యదర్శి గా బి. గంగ మణి ని మరియు జి. రఘునాథ్ ని , కోశాధికారి గా జి. ప్రవీణ్ కుమార్ గారిని, ఆర్గనైసింగ్ సెక్రటరీ గా సిహెచ్. గంగ్గయ్య, శ్రీ A. నరేష్, జి. విశాల్, టీ. వేణుగోపాల్, ఆర్. శివ కుమార్, జి. శ్రీధర్, బి. కల్పన,ను మరియు అడ్వైసర్ లుగా అరిసె శంకర్, వి. వేంకటేశ్వర్ రావు ను మండలం లోని ఎస్ జి టి ఉపాధ్యాయులు ఏకగ్రీవం గా ఎన్నుకున్నారని.
