టీమిండియా వల్ల నిద్రపట్టలేదు..

Aiden Markram. Aiden Markram.

టీమిండియా వల్ల నిద్రపట్టలేదు.. మార్క్రమ్ ఎమోషనల్!

 

 

 

 

 

ఐసీసీ ట్రోఫీ దాహాన్ని ఎట్టకేలకు తీర్చుకుంది సౌతాఫ్రికా. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ట్రోఫీని అందుకుంది ప్రొటీస్.

సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు రావడం ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టడం.. గత రెండు దశాబ్దాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా పరిస్థితి ఇది. టీ20లు, వన్డేలు, టెస్టులు అనే తేడాల్లేకుండా ప్రతి ఫార్మాట్‌లోనూ అదరగొట్టడం, మేజర్ టోర్నమెంట్స్‌లో నాకౌట్స్ వరకు దూసుకురావడం.. కీలకపోరులో చతికిలపడటం వాళ్లకు ఓ సంప్రదాయంలా మారింది. దీంతో వాళ్లపై చోకర్స్ అనే ముద్ర పడింది. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ మొదలైనప్పుడు సఫారీలకు మరో ఓటమి తప్పదని చాలా మంది అనుకున్నారు. అయితే అంతా రివర్స్ అయింది. చెలరేగి ఆడిన బవుమా సేన.. కంగారూలను చిత్తు చేసి 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకున్నారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ హీరో ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు.

ఆసీస్‌పె చిరస్మరణీయ విజయం సాధించడంతో మార్క్రమ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సహచర ఆటగాళ్లతో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్-2025 ఫైనల్‌ను తలచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత్ చేతుల్లో ఓడటంతో తనకు నిద్రపట్టలేదన్నాడు. ఆ పోరులో ఔట్ ‌అయ్యాక ఒంటరిగా కూర్చొని ఉండిపోయానని, ఆ క్షణం చాలా నిస్సహాయంగా అనిపించిందన్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నానని, ఇలాంటి సమయం వస్తే అలా కూర్చోకూడదని, అటో ఇటో తేల్చేయాలని డిసైడ్ అయ్యానని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.

‘నిన్న మొత్తం టీ20 ప్రపంచ కప్ గురించి ఆలోచించా. ఔట్ అయ్యాక నిస్సహాయంగా ఎలా కూర్చున్నానో గుర్తొచ్చింది. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని నిర్ణయించుకున్నా. ఇది నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే ఆసీస్‌తో పోరులో క్రీజులో పాతుకొనిపోయా. నా బాధ్యత నేను నిర్వర్తించాలి, జట్టు గెలుపు కోసం సాధ్యమైనంతగా పోరాడాలి అనేది దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్ చేశా’ అని మార్క్రమ్ వ్యాఖ్యానించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!