పోక్లైన్ డబ్బాలో నిండా పైసలు.
కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.
బొమ్మ పూర్ క్వారీలో లారీకి ఆరు వందలులు వసూల్.
వేబిల్ వద్ద 200, లోడింగ్ కు 300,
కాంట వెయ్యకుండానే ప్రతి లారీకి 600 చొప్పున తీసుకొని “వేబిల్ “ఇచ్చిన లారీలు.
కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.
లారీ కాటా పై వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళితే సరిపోతుంది, వే బిల్,రెడీ.
అడిగే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ వ్యక్తులు దాడికి సిద్ధంగా ఉంటారు.
ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ డోంట్ కేర్ అనేలా కనబడుతుంది.
నా లారీ లోడ్ అయిపోయింది ఇప్పటికీ 600 ఇచ్చాను ఓ డ్రైవర్.
మహాదేవపూర్, నేటిధాత్రి:
ప్రభుత్వ ఆదేశాలు ఇసుక పాలసీ ఈ రెండు క్వారీల్లో మాత్రం అమలు పరచడం అసాధ్యంగా మారింది. ఇసుక లోడింగ్ వద్ద ఉన్న.” పోక్లైన్’ డబ్బాల నిండా పైసలు జమ చేసుకోవడం, వేబిల్ తోపాటు సీరియల్ వద్ద మరో రెండు రెండు వందల రూపాయలను వసూలు చేస్తున్నారు, అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కేవలం ఇసుక లారీల్లో నింపి, కాంట చేయకుండానే బేబీల్లో లారీ యొక్క సైజులు పట్టి వే బిల్ ,లో ఇన్ని టన్నుల ఇసుక అని వేయడం జరుగుతుంది. కాటా చేయకుండా లారీల రవాణా వ్యవహారం అదనపు బకెట్ ఇసుక లారీల్లో నింపడం జరుగుతుందని స్పష్టం కావడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ ఈ రెండు క్వారీల్లో టీఎస్ ఎండిసీ శాఖ చర్యలకు బదులు, క్వారీ కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుంది.
తాడ్పాల్ వేసుకుంటున్న 600 తీసుకున్నారు వేబిల్ వద్ద 300 ఇచ్చాను డ్రైవర్.
లోడింగ్ పుక్లైన్ డబ్బాలో నిండా పైసలు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలం బొమ్మ పూర్ గ్రామం పేరుతో గ్రామ శివారులో ఏర్పాటు చేసిన, బొమ్మ పూర్ ఒకటవ నంబర్, అలాగే ఎలికేశ్వరం రెండవ నంబర్, పేర్లతో గత సంవత్సరం నవంబర్ నెలలో ప్రారంభమైన ఈ రెండు ఇసుక క్వారీలు అక్రమ ఇసుక రవాణాకు పెద్ద మొత్తంలో తెరలేపడం జరిగింది, ప్రభుత్వం ఉన్నత అధికారులు ఈ రెండు ఇసుక క్వారీల పై ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నత అధికారులు పర్యవేక్షించడం కూడా జరిగింది. అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రవ అక్రమ రవాణా పై అడ్డుకట్ట వేస్తూ కొత్త పాలసీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం మాత్రం అధికారుల ఆదేశాలు ఇసుక పాలసీ ను తుంగలో తొక్కి, టీఎస్ ఎండిసీ అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని, అక్రమ వసూళ్ల నేటికీ కొనసాగిస్తుంది.
కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారిన టీఎస్ఎండిసి సిబ్బంది.
మహాదేవపూర్ మండల పరిధిలోని పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేస్తున్న బొమ్మ పూర్, ఇలికేశ్వరం పేర్లతో నిర్వహించబడుతున్న ఈ రెండు క్వారీలు, టి ఎస్ ఎం డి సి సిబ్బంది అధికారులను తమ గుమస్తాగా మార్చుకొని, ఇసుక లోడింగ్ వద్ద ప్రతి లారీకి 300 రూపాయల వసూళ్లు చేయడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ కొరకు సీరియల్ వద్ద మరో 200 నుండి 300 వరకు, అలాగే వేబిల్ ఇచ్చే క్రమంలో మరో 200 రూపాలను లారీల నుండి తీసుకోవడం జరుగుతుందని డ్రైవర్లు నిర్భయంగా చెప్పడం జరుగుతుంది, లోడింగ్ పాయింట్ వద్ద లోడ్ చేసి అటువంటి ఫోక్లైన్ లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేసి, లోడింగ్ కు వచ్చే, ప్రతి లారీ వద్ద 300 రూపాయలను తీసుకోవడం జరుగుతుంది, కొందరు డ్రైవర్లు 200 ఇచ్చిన లోడింగ్ చేసే ప్రసక్తి లేదని 300 ఇస్తేనే లోడింగ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
కొన్ని రోజులుగా కాంటా బిల్ లేదు.
ఈ రెండు ఇసుక క్వారీల యజమాన్యం కొత్త రకమైన అక్రమానికి తెరలేపింది, గత కొన్ని రోజులుగా లోడింగ్ చేసుకొని వచ్చిన లారీ కాటా పైకి వెళ్లి, “సెల్యూట్ కొట్టి” వెళ్లిపోవాల్సిందే లారీలో ఎంత ఇసుక ఉంది, ఏమైనా ఎక్కువ ఇసుక వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అని కాంట చూసే ప్రసక్తి లేదు, లారీ సైజును బట్టి లారీలో వచ్చిన టన్నులను బేబీల్ లో వేయడం జరుగుతుంది, కాంట రిసిప్ట్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు, అడుగుతే కరెంటు లేదు, బ్యాటరీ ఇంవేటర్ చెడిపోయింది అని సమాధానం చెప్పడం, గట్టిగా ప్రశ్నించే పరిస్థితి అక్కడ లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ కు సంబంధించిన కొందరు ప్రశ్నించే వారిపై, లేదా ఫోటో వీడియో లాంటి వాటిని చిత్రీకరిస్తామని ప్రయత్నించిన ఆ డ్రైవర్లకు ఇతరులపై దాడికి సిద్ధంగా కొందరిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రశ్నించే పరిస్థితి లేదని స్పష్టంగా కనబడుతుంది.
ఉన్నత అధికారుల ఆదేశం, ఈ క్వారీ కాంట్రాక్టర్ “డోంట్ కేర్” అనేలా కనబడుతుంది.
ఉన్నత అధికారుల పర్యవేక్షణ అనంతరం కూడా బొమ్మ పూర్ ఎలికేశ్వరం ఇసుక క్వారీల అక్రమాలు, ఆగడం లేదంటే దీని వెనుక కారణం ఎవరు, టీఎస్ఎండిసి సిబ్బంది అధికారులు, ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచాల్సింది పోయి, కాంట్రాక్టర్ గుమస్తాలుగా మారి, వారితో కలిసి వసూళ్లు చేయడం జరుగుతుంది అంటే, దీని వెనుక అధికార యంత్రాంగం హస్తము కూడా ఉందని స్పష్టమవుతుంది. తక్షణమే మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఎండిసి, జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఈ రెండు ఇసుక క్వారీలను సందర్శించి, అక్కడ జరుగుతున్న అక్రమాల పై డ్రైవర్ల తో వివరాలు సేకరించి, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.