భారత్, చైనా, తుర్కియేలకు ప్రయోగశాలగా మారిన పాక్
భౌతికంగా దెబ్బతిన్న పాక్, పరోక్షంగా ఓడిన చైనా, తుర్కియే
పహల్గామ్ మృతులకు కనీసం సంతాపం తెలపని ఎర్డొగాన్
అమెరికా, చైనాలను సవాలు చేసే స్థాయికి ఎదుగుతున్న భారత్
డెస్క్,నేటిధాత్రి:
పహల్గామ్ దాడి, అనంతరం భారత్ సిందూర్ పేరుతో చేపట్టిన సైనికచర్యతో పాకిస్తాన్ను తిరిగి లేవలేని స్థితికి అణచివేసిన వైనం, ఈ క్రమంలో త్రివిధ దళాల సమన్వయంతో వ్యవహరించ డం, మరోవైపు తన పటిష్టమైన దౌత్యంతో ప్రపంచ దేశాలను తనకు అనుకూలంగా మలచుకోవడం వంటి అంశాలు ఇప్పుడు భారత్ను అంతర్జాతీయ సమాజంలో అత్యున్నతస్థాయిలో నిలిపా యి. దేనికైనా కాలం రావాలన్నది ఒక సూక్తి. ఇప్పటివరకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో నానా ఇబ్బందులు పడిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి ‘ఈ పని ఎందుకు చేశామా?’ అని బాధపడే స్థాయిలో బుద్ధి చెబుతోంది. ముఖ్యంగా ‘సీమాంతర ఉగ్రవాదం’పై తాను నిరంతరం కొనసాగి స్తున్న పోరులో ప్రపంచ దేశాల మద్దతును పొందగలుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం యూరప్ మరియు ఇతర పాశ్చాత్య దేశాలు ఉగ్రవాదం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో భారత్ చేస్తున్న పోరుకు వీటినుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. కేవలం మతాన్ని నమ్ముకొని ఇస్లామిక్ దేశాల మద్దతు పొందాలని చూస్తున్న పాక్ యత్నాలు ఇప్పుడు సఫలం కావడంలేదు. మతం కంటే వాణిజ్యం అధికమన్న సత్యాన్ని గుర్తించడంతో అతిపెద్ద మార్కెట్గా వున్న భారత్ను కాదని అవి అడుగుముందుకేయలేని పరిస్థితి. ఇదే సమయంలో పాక్కు మద్దతివ్వడంవల్ల ఒరి గేది ఏమీలేదన్నది కూడా వాటికి బాగా తెలిసొచ్చింది. కాకపోతే ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియే, అజర్బైజాన్లు మాత్రం పాక్కు అండగా నిలిచాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు ప్రపంచంలో ఏకాకిగా మారక తప్పదు. నిజం చెప్పాలంటే గతంలో భారత్కు ప్రపంచ దేశాల్లో పలుకుబడి చాలా పరిమితంగానే వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి గా మారిపోయింది. దౌత్యవిధానాల్లో సమూల మార్పులు తీసుకొని రావడమే కాదు, గ్లోబల్ సౌత్కు నాయకురాలిగా తన ను తాను నిరూపించుకుంటోంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో వుండే అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిని వినిపించడంలో భారత్ ఎంతో సమర్థవంతంగా వ్యవహరి స్తోంది. జీ`20 అధ్యక్షురాలిగా, ఆఫ్రికన్ యూనియన్కు ఇందులో శాశ్వత సభ్యత్వం కల్పించి తన నాయకత్వ పటిమను నిరూపించుకుంది. జి`20 న్యూఢల్లీి డిక్లరేషన్ను సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించడం, భారత్ పేర్కొంటున్న ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న సమస్యలకు సమానమైన ప్రాధాన్యతతో సమ్మిళిత పరిష్కారాలు సాధించాలన్న వాదనకు గట్టి మద్దతు లభించినట్లయింది. అంతేకాదు సుస్థిరాభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేక పోరు, మౌలిక సదుపాయాల విస్తరణ, వాతావరణ మార్పు అంశాలపై ప్రపంచ దేశాలను ఏకతాటిమీదకు తీసుకొని రాగలిగింది.
ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ వేగంగా, తీవ్రస్థాయిలో స్పందించిన తీరు ప్రపంచాన్ని అబ్బురపరచింది. భారత్ సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సాధించిన అద్భుతమైన ప్రగతి, సైనికచర్యల సందర్భంగా త్రివిధ దళాల మధ్య సమన్వయం ఎంతటి ఉత్తమ ఫలితాలి స్తాయన్న సత్యాన్ని ప్రపంచం గుర్తించింది. అంతేకాదు భారత్ వద్ద వున్న నాణ్యమైన మరియు బలమైన సాంకేతికతను ప్రపంచ దేశాలు విస్పష్టంగా గుర్తించాయి. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ను నిర్వహిస్తూనే మరోవైపు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆంక్షల కమిటీ, ఉగ్రవాద నిరోధక విభా గం, ఉగ్రవాద నిరోధక ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను వివరించడం ద్వారా తగిన మద్దతును కూడగట్టగలిగింది. భారత భూభాగంలో దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలను యు.ఎన్.కు మరింత వివరంగా చెప్పి మద్దతు కూడగట్టడానికి యత్నించింది. భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పు డు ఇచ్చిన వివరణలకు ప్రపంచ దేశాలు మద్దతునిచ్చాయి.
చురుకైన దౌత్యం, ప్రపంచ వేదికలపై చూపిన నాయకత్వ పటిమ, తన భద్రతకు సంబంధించినఅంశాలను ప్రపంచ దేశాలకు వివరించిన విధానం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మిత్రులను సంపాదించిపెట్టింది. గత ప్రభుత్వాల కాలంలో భారత్ పలుకుబడి చాలా పరిమితంగానే వుండేది. మతం పేరుతో ఇస్లామిక్ దేశాలతో పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు నెరపడం, అణ్వస్త్రాలుకలిగిన ఏకైక ఇస్లామిక్ దేశంగా తనను తాను ప్రదర్శించుకున్న పాకిస్తాన్, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పూర్తిగా కుదేలైంది. ఇప్పుడు తాను అణ్వస్త్రదేశమని చెప్పుకోవడానికి కూడా ఏమీలేదు. కేవలం కొద్ది గంటల్లో పాకిస్తాన్కు చెందిన 1/3వ వంతు వైమానిక దళాన్ని భారత్ ధ్వంసం చేసింది. ఎఫ్`16, జె.ఎఫ్`17 యుద్ధ విమానాలను చూపి భయపెట్టిన పాక్కు ఇప్పుడు అవికూడా ధ్వంసం కావడంతో భారత్ సత్తా ఏంటో తెలిసొచ్చింది. భారత్ ఇంతటిస్థాయిలో రక్షణ మరియుసాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తుందని పాక్ ఎంతమాత్రం ఊహించలేదన్నది స్పష్టమైంది. అర్మీనియా ఓటమికి ఉపయోగపడిన తుర్కియే డ్రోన్లను ఉపయోగించి భారత్ను దెబ్బతీయాలనుకున్న పాక్ అతివిశ్వాసం నిండా ముంచింది. పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను కుప్పకూల్చ డంతో పాకిస్తాన్ అయోమయంలో పడగా, తుర్కియే అహంకారాన్ని అణచివేసినట్టయింది. ఇక చైనా ఆయుధాల సంగతి ఎంత తక్కువ చెబితే అంతమంచిది. అన్ని వందలకోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన రక్షణవ్యవస్థలు ఎందుకూ పనికిరానిరీతిలో భారత్ చేతిలో ధ్వంసం కావడం, పాకిస్తాన్ను హతాశురాలిని చేస్తే, చైనా ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే భారత్, చైనా, తుర్కియే దేశాలకు పాకిస్తాన్ ఒక ప్రయోగశాలగా మా రింది. తమ ఆయుధాలు, సాంకేతికత ఎట్లా పనిచేశాయో ఈ దేశాలు ఒక అంచనాకు రాగా, ఈ ‘ప్రయోగాల’ దెబ్బకు పాక్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఒక విఫలదేశంగా, ఉగ్రవాద ఉత్పత్తికేంద్రంగా, మతపిచ్చతో నిండిపోయిన దేశంగా తనకంటూ ఒక ముద్రను వేసుకుంది. భారత్ చేతిలో చావుదెబ్బలు తిని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన దౌర్భాగ్యపు ఘనత దక్కించుకున్న దేశం కూడా పాకిస్తానే! కాల్పుల విరమణ జరగకపోతే ఈపాటికి తనకంటూ ఒక గు ర్తింపు లేని దయనీయస్థితికి పాక్ చేరుండేది.
తమపై దాడిచేసిన భారత్పై ప్రతీకారానికి అణ్వాయుధాలు ఇవ్వాలని ఒకవేళ మిగిలిన ఉగ్రవా దులు డిమాండ్ చేస్తే, కాదనే పరిస్థితి బహుశా పాకిస్తాన్కు వుండదు. దేశ రాజకీయ నాయక త్వం, సైన్యం అంతటి దుస్థితికి దిగజారిపోయాయి. రాజకీయ నాయకుల మాటలు సైన్యం వినదు, సైన్యంలో ఉన్నతాధికార్ల మాటలను దిగువస్థాయి అధికార్లు పట్టించుకోరు. ఎవరూ ఎవరి మాటా వినరు. ఇదీ ప్రస్తుత పాక్ దుస్థితి!
ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రస్తుతం సింధూనది నీరు నిలిచిపోవడంతో, దేశ ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడిరది. ఈ సమస్యను పరిష్కరించకపోతే దేశంలో తిరుగుబాటు రావడం ఖాయం. ఇప్పటికే నదీజలాల విషయంలో పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతు న్నాయి. సింధ్ ప్రజలు నీటికోసం తిరగబడుతున్నారు. బెలూచిస్తాన్ దాదాపు స్వాతంత్య్రం ప్రక టించుకునే దశకు వచ్చేసింది. అసలు పాక్ సైన్యం ఖైబర్ ఫక్తూన్క్వా, బెలూచిస్తాన్లలో అడుగు పెట్టలేని దుస్తితి. ఈ ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ అధికారం చెల్లడంలేదు. ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటూ, ఇంకా కశ్మీర్ పాట పాడటం, ఉగ్రవాదులను ఎగదోసి మారణకాండకు పాల్పడటం ద్వారా పాక్ ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులే తనను మింగే స్థాయికిచేరుకున్నారు.
మొత్తంమీద చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్, పాక్ను అథ్ణపాతాళానికి తొక్కేస్తే, భారత్ సామ ర్థ్యం ఆకాశాన్నంటింది. ప్రపంచాన్నే తనవైపుకు తిప్పుకుంది. భవిష్యత్తులో చైనా తన వ్యూహాలను మార్చుకొని, కొత్త పంథాలో భారత్ను ఇబ్బంది పెట్టడానికి యత్నించవచ్చు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు బలీయమైన వ్యవస్థలుగా పేరును సుస్థిరం చేసుకున్న తరుణంలో, ఇప్పుడు భారత్ వాటిని తలదన్నే రీతిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం, ముఖ్యంగా చైనాకు మింగుడుపడటంలేదు. తన ప్రాక్సీగా పాకిస్తాన్ను ప్రయోగించాలన్న ఆశలూ గల్లంతయ్యాయి. క మ్యూనికేషన్ రంగం ప్రపంచ వ్యాప్తంగా నలుమూలల విస్తరించిన నేపథ్యంలో పాతచింతకాయ పచ్చడి వంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం వల్ల అభాసుపాలవడం తప్ప ఏవిధమైన ప్రయోజనం వుండబోదని స్పష్టమైంది. చైనా సాంకేతిక లసుగులు అర్థం చేసుకున్న అమెరికా మరింత కఠినంగా వ్యవహరించవచ్చు. అయితే వాణిజ్యంలో మాత్రం పరస్పర లాబాలే ప్రాతిపదిక కనుక ఇందుకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ‘ఆధిపత్యం’ అనేది మనం కోరుకుంటే రాదు… కేవలం ‘సామర్థ్యం’ వల్లనే వస్తుందనేది ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి వెల్ల డిరచింది.