ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం.

Construction of Temples. Construction of Temples.

ఆలయాల నిర్మాణానికి భారీ విరాళం

ఆలయాల నిర్మాణానికి తండ్రి జ్ఞాపకార్థకంగా తనయులు భారీ విరాళం అందజేత

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

కేసముద్రం మున్సిపల్ లోని విలేజ్ కేసముద్రంలో ఇటీవలే విశ్వబ్రాహ్మణ సంఘ వారు శ్రీశ్రీ కాశీ విశ్వేశ్వరాలయం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయము మరియు శ్రీ సరస్వతి దేవి అమ్మవార్ల ఆలయాల నిర్మాణానికి భూమి పూజ సిలన్యాస శంకుస్థాపన చేయడం జరిగింది.

అనంతరం ఆలయాల కమిటీ సభ్యులు ఆలయాల నిర్మాణం కొరకు నిధుల సేకరణ చేపట్టడం జరిగింది.

ఈ నిధుల సేకరణలో భాగంగా కేసముద్రం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి కీర్తిశేషులు చిల్లం చర్ల లక్ష్మణరావు ల జ్ఞాపకార్ధకంగా వారి సతీమణి చిల్లం చర్ల ధనమ్మ మరియు కుమారులు చిల్లం చర్ల శ్రీనివాస్, శ్యాంసుందర్, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ లు ఆలయ నిర్మాణం కొరకు వారి తండ్రి జ్ఞాపకార్థకంగా ఒక లక్ష ఒక వెయ్యి 116 ఆలయాల నిర్మాణం కొరకు భారీ విరాళం అందజేయడం జరిగింది.

చిల్లంచర్ల లక్ష్మణరావు కుటుంబం గ్రామంలో ఇప్పటివరకు నిర్మించిన ఆలయాలకు విరాళం దాతలుగా ముందు వరసల ఉండేవారని అనాదిగా

ఈ కుటుంబం భక్తి శ్రద్దలకు నిదర్శనంగా నిలిచారని అలాగే వ్యాపార రంగంలో ఎంతో నిజాయితీగా కొనసాగే వారిని అందరిని తన మంచితనంతో ఆకట్టుకునే వారిని ఇలాంటి వారు సమాజానికి ఎంతో అవసరమని వారి జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

వీరి తనయులు కూడా తండ్రి బాటలో నడుస్తున్నందుకు వారి ఆశయాలను నిలబెట్టుకుంటూ తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు గ్రామం ప్రజలు వీరి దాతృత్వానికి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి రాజేశ్వరరావు, చిట్టోజు రమణాచారి, ఆరెందుల కుమారస్వామి, కందుకూరి సోమయ చారి, ఉల్లి వెంకటేశ్వర్లు, తుమ్మనపల్లి జితేందర్ రావు, బొల్లోజు శ్రీనివాస్, చిట్టోదు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!