గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను
కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారుల ఇళ్లపై ఏసీబీ విచారణ చేపట్టాలి
సీనియర్ జర్నలిస్ట్ నరసింహ
చర్ల నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
చర్ల మండలంలోని దండుపేట ప్రధాన రహదారి నుండి కొత్తపల్లి లింగాపురం గొంపల్లి మొగలపల్లి సి కత్తి గూడెం మరియు కత్తిగూడెం మీదుగా వేసిన గ్రామీణ సడక్ యోజన నిధులు సుమారు 54 కోట్ల రూపాయల నుంచి 58 కోట్ల వరకు సగం రోడ్లు వేసి పూర్తిగా కాకుండానే అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా స్వాహా చేశారు సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం లేదు కేంద్రం నిధులు అంటే అంతా చులకన అని సీనియర్ జర్నలిస్టు నరసింహా అన్నారు ప్రధాన రహదారి నుండి గోదావరి పరివాహక గ్రామపంచాయతీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుట కొరకు కేంద్రం ఎంతో దూర దృష్టితో ఆ నిధులను సమీకరిస్తే సదరు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వలన రహదారి పూర్తికాలేదు గోదావరి వరదలు సమీపిస్తున్నందున ఇకనైనా జిల్లా విజిలెన్స్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యుల దగ్గర నుండి నగదును రికవరీ చేపించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలి చర్ల మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రహదారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు