పట్టపగలే దౌర్జన్యానికి ఒడిగట్టిన దుండగులు.
ప్రభుత్వ ఉద్యోగి ఇసాక్ హుస్సేన్ కిడ్నాప్ కలకలం.
పోలీసులను ఆశ్రయించిన ఇసాక్ కుటుంబ సభ్యులు.
అడ్డుపడిన వారిపై దాడి చేస్తూ కిడ్నాప్.
“నేటిధాత్రి”, మహదేవపూర్.
మహదేపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగి షేక్ ఇసాక్ హుస్సేన్, నీ పట్టపగలు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేయడం జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి ఇసాక్ కిడ్నాప్ మండల కేంద్రంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, సోమవారం సాయంత్రం 7:15 నిమిషాలకు ఇసాక్ హుస్సేన్ మండల కేంద్రంలోని “జామె మస్జిద్ లో మగ్రిబ్” నమాజ్ చదివి బయటికి రావడంతో, గుర్తు తెలియని వ్యక్తులు మస్జిద్ పక్క భాగంలో ఎర్టిగా కారు ఆపుకొని ఇసాక్ హుస్సేన్, కొరకు కాపుకసి, బయటికి రాగానే, సుమారు నలుగురు వ్యక్తులు అతనిపై దూకి పట్టుకోవడం జరిగిందని, కొందరు అతని పొట్ట భాగంలో కొడుతూ, కార్లోకి ఈడ్చి పడేస్తూ, ఇసాక్ హుస్సేన్ బయటికి రావడంతో, తిరిగి గుర్తు తెలియని దుండగులు అతనిపై మరింత దౌర్జన్యంతో కార్లోకి నిక్కీ డోర్లను బ్లాక్ చేశారు, గమనించిన స్థానికులు దౌర్జన్యం పై అడ్డుపడితే వారిని సైతం, దాడికి దిగేలా దొబ్బడం జరిగిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఎవరికి దగ్గరికి రానివ్వకుండా, ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టపగలు జనం చూస్తుండగానే, గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం మండల కేంద్రంలో సంచలనం రేపింది. కిడ్నాప్ చేసిన వారు ఇసాక్ హుస్సేన్ బంధువులని కొందరు చెబుతుంటే, మరికొందరు మాత్రం కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి నీ పట్టపగలు అపహరణకు గురికావడం సామాన్యుని పరిస్థితి ఏమిటది కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇసాక్ హుస్సేన్
న్ సోదరుడు షేక్ మహబూబ్ సంఘటన వద్ద ఉన్న సాక్షులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇసాక్ హుస్సేన్ హౌసింగ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ములుగు జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.