MPDO Urges Speeding Up Indiramma Housing Works
— ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.
ఎంపీడీవో రాజీరెడ్డి.
నిజాంపేట: నేటి ధాత్రి
లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని మండల ఎంపీడీవో రాజీరెడ్డి అన్నారు. మండలంలోని నగరం తాండ గ్రామంలో బుధవారం పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని దశలవారీగా లబ్ధిదారుల అకౌంట్లు ప్రభుత్వమే డబ్బులు జమ చేస్తుందన్నారు. ఇంచార్జ్ ఎంపీఓ నరసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి ఆరిఫ్, చంద్రహాస్ తదితరులు ఉన్నారు.
