Family Killed in Saudi Crash
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం: హైదరాబాదీ మౌలానా కుటుంబం దుర్మరణం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా యాత్రకు వెళ్లిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామానికి చెందిన మౌలానా, ఆయన కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనుమడు సోయబ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మక్కా వెళ్తుండగా బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో, మనుమడు సోయబ్ కిటికీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతనికి కాళ్లు విరిగి, స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం. మిగతా కుటుంబ సభ్యులు పాస్పోర్ట్ సమస్యల వల్ల ముందుగానే వెళ్లారు.
