వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా
సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు
వర్ధన్నపేట( నేటిదాత్రి ):
పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….