హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్.

HMS Union. HMS Union.

ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్రం మానుకోవాలి

హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల డిమాండ్

జైపూర్,నేటి ధాత్రి:

 

పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం ప్రభుత్వం హరిస్తుందని హెచ్ఎంఎస్ కార్మిక నేతలు ఆరోపించారు.ట్రేడ్ యూనియన్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సోమవారం హెచ్ఎంఎస్ కార్మిక నేతలు హెచ్చరింఛచారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 20న దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడు లుగా కుదించిందన్నారు.గత మార్చి నెల 18 నాడు ఢిల్లీలో హెచ్ఎంఎస్ యూనియన్ తో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు,అసంఘటిత కార్మిక సంఘాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలలో సమ్మె చేయుటకు నిర్ణయించారని పేర్కొన్నారు.దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా కార్మికులంతా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేశారు.సింగరేణిలో సమ్మె విజయవంతం చేయడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పనిచేసి, సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమై కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కోరారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడం మానుకోవాలని కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ కార్మిక నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!