
హీరాబాద్: 12 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గడువు పెంపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈనెల 12వ తేదీ వరకు పెంచారు. అడ్మిషన్ ఫీజును మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని, నేరుగా అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.