హిందువులు ఐకమత్యంగా ముందుకు వెళ్లాలి
ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘం బాలక్ పెద్దిరెడ్డి మల్లారెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో హిందువులంతా ఐక్యమత్తంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని ఆర్ఎస్ఎస్ వరంగల్ విభాగ్ సంఘం బాలక్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పెద్దిరెడ్డి మల్లారెడ్డి అన్నారు. శనివారం గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి దేవాలయంలో పట్టాభిరామాలయ శ్రీరామ భజన మండలి సభ్యులు బటీకే స్వామి అధ్యక్షతన హిందు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందువులు ఒక తాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో బుర్ర సదయ్య భూపాలపల్లి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ పట్టాభిరామ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బండారి శంకర్ మాదాసు మొగిలి గౌడ్ రామస్వామి ఉయ్యాల బిక్షపతి గౌడ్ రావుల సురేష్ గౌడ్ మోటపోతుల రాజన్న గౌడ్ మాదాసు అర్జున్ గౌడ్ తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ బూర రాజగోపాల్ గౌడ్ మూల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
