హైకోర్టు పి పి పల్లె నాగేశ్వర్ రావుని సన్మానించిన మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

మంచిర్యాల నేటిదాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రానికి మొట్టమొదటి సారిగా విచ్చేసిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పి పి) పల్లె నాగేశ్వర్ రావుని మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగుండాలని తెలియజేశారు.జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు మీ యొక్క సలహాలు సూచనలకు ఇవ్వాలని కోరగా దానికి అనుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!