
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో హైఅలర్ట్
ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు
మావోయిస్టు వారోత్సవాలతో చెన్నూర్ రూరల్ పోలీసుల అప్రమత్తం
కోటపల్లి,నీల్వాయి సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత వాహన తనిఖీలు
జైపూర్,నేటి ధాత్రి:
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ చేసి విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్న చెన్నూర్ పోలీసులు.మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో రామగుండం కమిషనర్,మంచిర్యాల డీసీపీ,జైపూర్ ఏసీపీ ఆదేశాల మేరకు చెన్నూర్ రూరల్ కోటపల్లి,నీల్వాయి పోలీసులు చెన్నూర్ రూరల్ సీఐ,కోటపల్లి ఎస్సై లు విస్తృతంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానితుల వివరాలను సేకరిస్తున్నమన్నారు. మావోయిస్టులు అడవులలో ఉండి హింసాత్మాక ఘటనలకు పాల్పడుతూ సాధించేదేమి లేదు జనజీవన స్రవంతిలో కలసి తమ కుటుంబ సభ్యులతో కలసి ఆనందమైన జీవితం గడపాలని,లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను పొందాలని చెన్నూర్ రూరల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.