వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక పరిధిలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ రమ్య తండ్రి రమేష్, (24) వయస్సు ఆమె భర్త మరణించగా గత కొంతకాలం నుండి తన తల్లిదండ్రు దగ్గర మామిడాలపల్లి లో నివాసం ఉండేది. కావున తేదీ:23.02.2024 రోజున ఉదయము 10 గంటలకు కుటుంబసభ్యులు అందరు చల్లూర్ లోని జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లగా రమ్య ఎవ్వరికి చెప్పకుండా ఇంటి నుండి వేళ్లిపోయిందని ఆమె ఆచూకీ గురించి ఎంత వెతికిన బంధువులకు తెలియజేసిన కూడా ఆమె జాడ తెలుస్తలేదని రమ్య తండ్రి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపినారు.