జోరుగా మద్యం దందా…
వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు…
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం.
అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…
అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?
నూగూర్ వెంకటాపురం/నేటిధాత్రి

(ఫిబ్రవరి26) వెంకటాపురం మండలంలో అక్రమ మద్యం దందా సాగుతున్న అధికారులు మౌనం వెనుక కారణం ఏమిటి.?వైన్ షాపుల తంతు చూస్తే ఆదాయం రెట్టింపు చేయడం కోసం వాహనాల ద్వారా మధ్యాన్ని తరలిస్తూ, ఎమ్మార్పీకి మించి వసూలుకు పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుడి,బడి అని తేడా లేకుండా బెల్ షాపులు ఉండడంతో మద్యానికి బానిసలు అవుతున్నారు.దీంతో పేద కుటుంబాల మధ్య గొడవలు కలహాలు నిత్యకృతమవుతున్నాయి,చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.బెల్స్ షాపుల్లో మద్యం విక్రయాలను తమ ఇష్టానుసారంగా కొనసాగిస్తూ,పేద కుటుంబాల వినాశనానికి కారణమైన బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.రెట్టింపు ఆదాయం కోసం బెల్ట్ షాపులను వైన్స్ యజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు విమర్శలు వెళ్లి వెతుకుతున్నాయి.వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు బెల్ట్ షాపులకు తరలిస్తూ గ్రామీణ ప్రాంతంలో విక్రయాలు అధిక ధరలకు అమ్మకాలు జరుగుతున్నరు.
వాహనాలతో మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సిండికేటుగా మారిన అక్రమ మద్యం వ్యాపారులు సాగిస్తున్నారు మండలంలో రెండు వైన్ షాపులు ఉన్నప్పటికీ ఒకటి మండల కేంద్రంలో రెండవది చోక్కాల గ్రామంలో ఉంది ఈ రెండు వైన్ షాపుల నుండి మద్యం రోజు ఉదయం 8 గంటల సమయంలో రెండు వాహనాల ద్వారా వెంకటాపురం మీదుగా పాత్రపురం,వీరభద్రారం,ఆలుబాక,సురవీడు,ఏదిరా,ఏకన్న గూడెం మీదుగా మద్యం తరలిస్తూ పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోందితదితర గ్రామాలకు చట్ట విరుద్ధంగా వాహనాల ద్వారా అక్రమ రవాణా జరుపుతున్నారు. ఇది వైన్స్ యజమాన్యమే అధిక ధరలకు విక్రయించేందుకు చేస్తూ ఒక సీసా పై 20 నుండి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నారు.
బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తున్న వైన్స్ యజమాన్యం

సిండికేట్ గా మారి మద్యం వాహనాల ద్వారా రవాణా చేస్తూ ప్రతి బెల్ట్ షాపులకు డోర్ డెలివరీ చేస్తూ,వైన్స్ యజమాన్యమే గ్రామాల్లో గుడి బడి అని తేడా లేకుండా బెల్ట్ షాపుల నిర్వాహకులను వైన్ షాప్ యాజమాన్యమే ప్రోత్సహిస్తుందని పలు అనుమానాలు వెళ్ళుతున్నాయి.
అక్రమ మద్యం తరలింపు పై మౌనం పాటిస్తున్న అధికార యంత్రాంగం…
అక్రమ మద్యం రవాణాపై ఇంతవరకు సంధిత అధికారులు చర్యలు తీసుకుపోవడం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుండే ఈ తథంగం జరుగుతున్నప్పటికీ ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో, అక్రమ మద్యం రవాణా ఇంకా జోరందుకున్నదని చెప్పుకోవాలి.గతంలో అమ్మకాల కంటే ఈసారి నేరుగా గ్రామాల్లోకి మద్యం తరలిపోవడంతో అమ్మకాలు ఇంకా జోరు సాగుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ఉన్నతాధికారులు సంబంధిత శాఖ అధికారులు అడ్డదిడ్డంగా వెలుస్తున్న వందలాది బెల్ట్ షాపులపై అలాగే అక్రమ రవాణా చేస్తున్న వైన్ యాజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
అనేక విమర్శలు వస్తున్న అధికారుల నిర్లక్ష్యం వెనక కారణం ఏమిటి.?
మద్యం వ్యాపారం అదుపు తప్పడంతో ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్న అధికారులను తాము చెప్పిందే చేయాలంటూ ఖద్దరు నేతల అడుగు జాడలో నడుస్తుందని తెలుస్తోంది. మండలంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులే ఉన్నారు. కొంత మంది నేతలు గ్రూపులుగా ఏర్పడి తలోకొంత పెట్టుబడులు పెట్టి మద్యం దందాను నడుపుతున్నారు. నేతలు తమ రాజకీయ పలుకుబడితో అధికారులను తమ దారికి తెచ్చుకుంటున్నారు. కొన్ని విషయాలను చూసీ చూడనట్లుగానే వదిలేయాలంటూ అధికారులను సైతం తమ దారికి తెచ్చుకుంటున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారం చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇవన్నీ తెలిసిన మౌనం పాటిస్తారు తప్ప, చర్యలు ఏమాత్రం తీసుకోరని జోరుగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.నెలవారీగా మాముళ్లను ముట్టజెప్పడంతో సైలెంట్ అయిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా క్షేత్ర స్థాయిలో అక్రమ మద్యం దందాపై ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.