-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న బిజెపి నాయకులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17
మొగుళ్లపల్లి ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను బిజెపి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి యాదవ్ నేతృత్వంలో బుధవారం బిజెపి నాయకులు పోలీస్ స్టేషన్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, స్వీట్లు తినిపించి..శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాధవ్ గౌడ్ మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేట్ పెరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా యువత డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు మండలంలోని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని వారిని కోరగా..బిజెపి నాయకులు సానుకూలంగా స్పందించారు. మండలంలోని ప్రజల పట్ల ఎస్ఐ మాధవ్ గౌడ్ స్పందించిన తీరును బిజెపి నాయకులు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కుమ్మరి సారయ్య, బండారి రవీందర్, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.