గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి.

సామాజిక వైద్యశాలలో కనీసం రక్త పరీక్షలు చేయలేని దుస్థితి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మల్లేష్ .

చిట్యాల, నేటిధాత్రి ;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాట్లాడుతూ రోజున ఇటీవల కురిసిన భారీ వర్షాలు వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో సీజనల్‌ వ్యాధులు వైరల్‌ ఫీవర్లతో ప్రజానీకం అవస్థలు పడుతున్నారని, డయేరియా టైఫాయిడ్‌ మలేరియా డెంగ్యూ చికెన్‌గున్యా అతిసార వంటి వాటికి బాధితులై జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు.
విష జ్వరాలతో విలవిలలాడుతున్నారు.
గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో పోతే విపరీతంగా దోచుకుంటున్నారు వాటిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని . ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించి వారిని ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు
మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు సక్రమమైన వైద్యం అందడం లేదు
కనీసం షుగర్ బీపి టెస్టులు చేయడానికి కూడా సిబ్బంది కానరావడం లేదు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతంచేయవలసిన అవసరం ఉన్నది, ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ గా డాక్టర్స్ వచ్చే విధంగా అధికారుల పర్యవేక్షణ చేయాలి
విధులకు హాజరు కాని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నా.రు, వాతావరణ పరిస్థితుల వల్ల దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వల్ల గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!