పాండురంగారావు పౌండేషన్ సేవలు అభినందనీయం:

బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

పాండురంగారావు ఫౌండేషన్ సేవలు అభినందనీయమని బంగారిగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య అన్నారు. శనివారం పాండురంగారావు ఫౌండేషన్ ద్వారా పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. విద్యార్థులకు పిఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందించిన స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు ఉపయోగించుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆయన విద్యార్థులను కోరారు. మా పాఠశాల తరపున పి ఆర్ ఆర్ ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రంగారావును, వెంకన్ననుశాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలోపౌండేషన్ అధ్యక్షులుపాండురంగారావు,బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు బొమ్మర బోయిన( పాటల) వెంకన్న, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, జీనత్ సాజిదా, నరేష్, ఆశ్రితతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *