“Doctors Said Six Months… Yuvraj Singh Chose to Fight”
ఆరు నెలలకు మించి బతకను అన్నారు.. క్యాన్సర్ నాటి రోజులను గుర్తు చేసుకున్న యువీ!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రాణాంతక క్యాన్సర్ను జయించిన విషయం తెలిసిందే. క్యాన్సర్తో బాధ పడుతూనే 2011 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా క్యాన్సర్ నాటి రోజులను, తనకు ఎదురైన అనుభవాలను యువీ గుర్తు చేసుకున్నాడు.
పునర్జన్మలా అనిపించింది..
‘2011-2012లో అమెరికాలో కీమో థెరపీ చేయించుకున్నా. అప్పుడు డాక్టర్ల మాటలు నాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. నేను క్యాన్సర్ను జయించి.. ఆరోగ్యంగా నడుచుకుంటూ ఆసుపత్రి నుంచి వెళ్లిపోతానని డా.ఐన్హార్న్ చెప్పారు. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి. నేను క్యాన్సర్ నుంచి కోలుకున్నాక.. ఇకపై క్రికెట్ ఆడొచ్చని వారు చెప్పాక.. అది నాకు పునర్జన్మలా అనిపించింది’ అని యువీ వివరించాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున పలు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్లో అతడు కేవలం 35 బంతుల్లోనే 77* పరుగులు సాధించాడు. అలాగే వన్డేల్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోర్ 150 పరుగులను ఇంగ్లాండ్పై కటక్ వేదికగా 2017లో జరిగిన మ్యాచ్లో సాధించాడు. తర్వాత అదే సంవత్సరం వెస్టిండీస్ టూర్లో అతడు చివరిసారిగా మైదానంలో కనిపించాడు. అనంతరం 2019లో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
