మాట తీసుకున్నాడు.. మరోసారి చేయబోతున్నాడట..
పవన్ కళ్యాణ్ కొత్త కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయనతో హిట్ సినిమా తీసిన దర్శకుడితో మరోసారి సినిమా చేయబోతున్నాడని తెల్సింది
పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్ల్లు’ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు. ‘ఓజీ’కీ కూడా కాల్షీటు ఇచ్చారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్ వెల్లడించారు. ఇంకో వైపు హరీశ్ శంకర్ కూడా ‘ఉస్తాద్ భగత్సింగ్’ షూటింగ్ షురూ చేశారు. ఈసినిమా సెట్లోనూ పవన్ పాల్గొంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కొత్త కథలు వింటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయనతో ‘బ్రో’ చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని పవన్తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల సముద్రఖని పవన్కు ఓ కథ చెప్పారట.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘బ్రో’ సినిమా వచ్చింది. పవన్ ఫ్యాన్స్ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్ సముద్రఖనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పవన్కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్నగర్ టాక్. తక్కువ సమయంలో, లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమా ప్లాన్ చేశారట. ఇటీవల సముద్రఖని పవన్ని కలిసి కథ చెప్పేసినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.
Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు
Dhanush: ‘కుబేర’.. టచ్ చేసే పాట