మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు
జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియ మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ కే.నరసింహ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో శ్రీ హర్షవర్ధన్ బాధ్యతలు చేపట్టారు.
మహబూబ్ నగర్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ , ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -1 గా విధులు నిర్వహిస్తున్న వీరు 2018 సంవత్సరంలో ఐపీస్ గా నియమితులైన మొట్టమొదట గ్రేహౌండ్స్లో నియమించబడ్డారు.తరువాత మంచిర్యాల ఏఎస్పీ గా, డీసీపీ ట్రాఫిక్-1, సైబరాబాద్ విధులు నిర్వహిస్తున్న వీరు హైదరాబాద్ పట్టణానికి చెందినవారని సమాచారం.