Journalists Demand House Sites in Bhupalpally
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి హరీష్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 37 మంది జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి స్థలం ఇవ్వలేదు ఈ సందర్భంగా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ నిరాహారదీక్షలకు మద్దతు తెలిపిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి
ఈ సంద్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సమాజం లో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే జర్నలిస్టులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని..అధికారులకు ప్రజా ప్రతినిధులకు జర్నలిస్టులు రోడ్డెక్కుతుంటే కనపడడం లేదా అని ప్రశ్నించారు.. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చీకటి గణేష్ నరేష్ నేత పొక్కూరి శ్రీనాథ్ గాజుల అరుణ్ సందీప్ గౌడ్ ఆదిత్య వినయ్ పటేల్ ప్రదీప్ ముదిరాజ్ వినయ్, రాజకుమార్ తది తరులు పాల్గొన్నారు
