ప్రతిపక్షం ముందు పాలక పక్షం వెలవెల.

https://epaper.netidhatri.com/

`హరీష్‌ రావు ముందు తేలిపోయిన మంత్రులు.

`హరీష్‌ రావు చెప్పిన వివరాలకు అసెంబ్లీ అవాక్కు.

`ప్రభుత్వ తప్పుడు లెక్కలను కడిగేసిన హరీష్‌ రావు.

`అడుగడుగునా హరీష్‌ రావును అడ్డకునేందుకు ఐదుగరు మంత్రుల అవస్థలు.

`పొంతన లేని మాటలు చెప్పలేక మంత్రుల తిప్పలు.

`ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల కుప్ప అని హరీష్‌ రావు ఎద్దేవా.

`కాగ్‌ రిపోర్ట్‌లతో కలిపి వివరిస్తూ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న హరీష్‌ రావు.

`సమాధానం చెప్పుకోలేక పాలకపక్షం చూసిన దిక్కులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రతిపక్షం దూకుడు అసెంబ్లీలో ప్రదర్శించింది. పాలక పక్షం గిలగిలలాడిరది. ఒక రకంగా చెప్పాలంటే విలవిలలాడిరది. ఒక్కడుగా మాజీ మంత్రి హరీష్‌రావు దూకుడు ముందు అధికారపక్షమంతా వెలవెలబోయింది. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష స్ధానంలో వుండి కూడా హరీష్‌రావు వన్‌మాన్‌ షో చేశాడు. పాలకపక్షానికి చెమటలు పట్టించారు. కాళేశ్వరం మీద కట్టుకధలు,పిట్ట కథలు చెప్పి, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి హరీష్‌రావు అసెంబ్లీ సాక్షిగా చుక్కలు చూపించారు. తనదైన శైలిలో అధికార పక్షానికి మాట లేకుండా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని హరీష్‌రావు డిమాండ్‌ చేయడంతో పాలకపక్షం బిత్తరపోయింది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి, ప్రజలు ముందు దోషిగా నిలబెడదామని అనుకున్న పాలకపక్షం తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. శ్వేతపత్రాలతో ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తామనుకున్న పాలకపక్షం పట్టపగలు చుక్కలు చూడాల్సి వచ్చింది. అసలు పాలకపక్షంలో ఎవరున్నారో? ప్రతిపక్షంలో ఎవరున్నారో తేరుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా, మంత్రులు బిత్తరపోయినంత పనైంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులాంటి వారు కూడా ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అంటూ సంబోధించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ఆసక్తికరమైన సందర్భం చోటు చేసుకున్నది. గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారి చట్ట సభ అసెంబ్లీలో ప్రతిపక్షం ముందు అధికార పక్షం వెలవెల బోయింది. మాజీ మంత్రి హరీష్‌రావు వాగ్ధాటికి పాలకపక్షం కకావికలమైంది. నిజానికి శ్వేతపత్రాల విడుదల అంటే ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ భపడుతుందని అధికార కాంగ్రెస్‌ ఊహించింది. కాని అందుకు భిన్నంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్‌రావు గుక్క తిప్పుకోకుండా, లెక్కల మీద ఎలాంటి షశబిషలు లేకుండా అలవోకగా పాలకపక్షం సభముందుంచిన లెక్కల లోగుట్టు విప్పుతుంటే అధికార పక్షం నోరెళ్లబెట్టి వినాల్సివచ్చింది. అంతే కాకుండా కాళేశ్వం మీద విచార చేపడతామంటూ, పదే పదే కాంగ్రెస్‌ నాయకులు బైట చేస్తున్న ప్రకటనలకు సభా వేధికగా హరీష్‌రావు పాలకపక్షం ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నంచేశారు. అలా హరీష్‌రావు స్పందించడంతో పాలపపక్షానికి పాలుపోలేదు. వెలవెల పోయి చూడడం తప్పలేదు.
సహజంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ పాలకపక్షంగా, ఓటమిపాలైన పార్టీని చెడుగుడు ఆడుకున్న సంఘనలు వుండేవి.
కాని బిఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో వున్నా, తమదే పై చేయి అని పాలకపక్షం చేయికి వాయిస్‌ లేకుండా చేయడం గమనార్హం. ఎందుకంటే నిజాలను ఎవరూ తారుమారు చేయలేరు. కట్టుకథలల్లి ఎల్లకాలం నిజాలని నమ్మించలేరు. తప్పులను చెప్పి ఒప్పులుగా మార్చలేరు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సుబిక్షంగా వుంది. సుసంపన్నమైన ప్రగతిని సాధించింది. చింతలు లేని జీవితాలు తెలంగాణ ప్రజలు అనుభవించారు. అరవైఏళ్ల గోస పోయింది. పల్లెల్లో మళ్లీ పచ్చదనం, పాడి, పంట వెల్లివిరిసింది. పల్లె ఆకుపచ్చని అందాలు అద్దుకున్నాయి. తెలంగాణ సాగులో విప్లవం సాధించింది. ఊహించని దిగుబడులతో అన్నపూర్ణగా విలసిలిల్లంది. రైతు రాజయ్యాడు. రైతు రాజ్య స్ధాపన జరిగింది. అంత గొప్పగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దబడిరది. కాని అధికారమే పరమావిధిగా కాంగ్రెస్‌పార్టీ పదే పదే ఎన్నికల ముందు అబద్దాలు వల్లెవేసింది. చెప్పిందే చెప్పి, తప్పుడు ప్రచారాలు నమ్ముకొని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి, అధికారంలోకి కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. పది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రంగు బైటపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పాలనపై అవగాహన లేక, మేధావులుగా తమకు తాము చిత్రీకరించుకునే వారి మాటలు నమ్మి, అధికార పక్షం బోల్తాపడిరదన్న విషయాన్ని హరీష్‌రావు లెక్కలతో సహాబైటపెట్టారు. ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా చేశారు. సమర్ధుడైన నాయకుడు ప్రశ్నిస్తే ఎలా వుంటుందో పాలకపక్షానికి తెలిసి వచ్చింది. వెంటనే తేరుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని హరీష్‌రావు వాగ్ధాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అడుగుడగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అడుగడుగునా హరీష్‌రావుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంచేశారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గత ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వలేదంటూ ఏదో చెప్పబోయి ఇరుకున పడ్డాడు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదు. అందులో డబ్బు దాచుకోవడం వుండదని, ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్ధ ఒక ప్రవాహం లాంటిదంటూ, వచ్చే లెక్క, పోయే లెక్క వుంటుందని హరీష్‌రావు అనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కలుగజేసుకున్నారు. తాను మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడం నిజమే కాని, గతంలోనే తాను పార్లమెంటు సభ్యుడినని, ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదని తమకు తెలుసని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దాంతో అధికార పక్షం ఎంత డిఫెన్స్‌లో వుందో అర్ధమైంది. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరోసారి మంత్రి జూపల్లి కలుగజేసుకున్నారు. సందర్భంలేకుండా తలదూర్చి హరీష్‌రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక విద్యుత్‌ అప్పులు, విద్యుత్‌ తయారీ సంస్ధలు, కేంద్రం ఒత్తిళ్లు, మోటార్లకుమీటర్ల అంశం ప్రస్తావనకువచ్చింది. ఈ విషయంలో హరీష్‌రావు చెబుతున్న విషయాలు అధికార పక్షానికి నచ్చలేదు. కేంద్రం ప్రభుత్వం ఎంత ఒత్తిడిచేసినా, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన విషయాన్ని ఘంటాపధంగా హరీష్‌రావు మరోసారి చెప్పారు. అంతే కాకుండా తన కంఠంలో ప్రాణం వుండగా మోటార్లును ఎట్టిపరిస్ధితుల్లో కూడా అనుమతించేది లేదని తేగేసిచెప్పిన సందర్భాన్ని గుర్తుచేశారు. దాంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని, సమర్ధించుకోబోయారు. మోటర్లకు మీటర్ల అంశపై తాను పార్లమెంటరీ కమీటీ సభ్యుడినంటూ చెప్పుకున్నాడు. హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన విషయాలను హరీష్‌రావు సభ దృష్టికి తెచ్చారు.
అంతే కాకుండా తెలంగాణలోని 70లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం, 35వేల కేంద్రం అప్పు కూడా వదులుకున్నామని చెప్పడంతో ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ సభ్యులు బల్లలు చర్చడంతో అసెంబ్లీలో అధికార పక్షం అవాక్కయింది. సహజంగా పాలకపక్షం ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నప్పుడు సభ్యులు బల్లలు చరుస్తుంటారు. కాని చాలా కాలం తర్వాత పాలకపక్షంమీద ప్రతిపక్షం ఎదురుదాడి చేసి, పాలకపక్షానికి మాటలు లేకుండా చేసి బల్లలు చర్చే పరిస్దితి రావడం అంటేనే ప్రతిపక్షం పైచేయి సాధించినట్లు లెక్క. అది ఈ రోజు అనేక సార్లు అసెంబ్లీలో కనిపించింది. ఎలాగైనా మధ్యలో కలుగుజేసుకొని హరీష్‌రావును ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రయత్నం చేశారు. వరంగల్‌ నడిబొడ్డును వున్న జైలు కూల్చేశారంటూ, ఆసుపత్రి ఊరు అవతల నిర్మాణం చేస్తే బాగుండేదన్నారు. వెంటనే అందుకున్న హరీష్‌రావు ప్రజలకు అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రి ఊరవతల నిర్మాణం చేయాలని, జైలు నగరం నడిబొడ్డున వుండాలని సురేఖ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. దాంతో మరోసారి ప్రతిపక్ష సభ్యులు బల్లలు చర్చారు. ఎలాగైనా మంత్రి హరీష్‌రావు దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేశారు. కాని ఆయన వేసిన ఎత్తును కూడా హరీష్‌రావు చిత్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వున్న లుకలుకలు అసెంబ్లీ సాక్షిగా బైట పెట్టి, బిఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షమని మరోసారి రుజువు చేశారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలోవున్నా ప్రజల కోసం నిత్యం పాటు పడేది బిఆర్‌ఎస్సేనని మరోసారి హరీష్‌రావు నిరూపించారు. పాలకపక్షం సభ్యులనుంచి కూడా తర్వాత ప్రశంసలందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!