— కష్టించిన పంట
వానపాలు
• లారీలు రాక తిప్పలు
• టార్పాలిన్లు అందివ్వని నిర్వాహకులు
నానిన వడ్లను కొనుగోలు చేయాలి
నిజాంపేట: నేటి ధాత్రి
రైతు ఆరుకాలం కష్టించి పండించిన పంటకు లాభం లేకుండా పోయిందని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తే వానపాలు అవుతున్నాయన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు లారీల కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. రెండు, మూడు లారీలకు సరిపోడ ధాన్యం బస్తాలు ఉన్నప్పటికీ ఆ ధాన్యం బస్తాలను రైస్ మిల్లు లోకి తరలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ అకాల వర్షాలు నేపథ్యంలో చేతికి వచ్చిన పంటను కండ్లముందే నీటిపాలు చేసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. సొసైటీ నిర్వాహకులు రైతులకు ఎలాంటి టార్పాలిలను అందివ్వడం లేదని తమ వద్ద ఉన్న టర్పాలిన్ లు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ నిర్వాహకులు శరవేగంగా కొనుగోలు జరపాలని వేడుకుంటున్నారు. వానకి నానిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకు 20 రూపాయల చొప్పున తాటి పత్రిలకు కిరాయి తెచ్చుకుంటున్నామని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.