
ఎస్సై తిరుపాజీ.
బాలానగర్ / నేటి ధాత్రి
నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని.. మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎస్సై తిరుపాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే… ఈ నూతన సంవత్సరం మండల ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. యువత నూతన సంవత్సరాన్ని బయట కాకుండా.. కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్లపైకి రాకూడదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు 4 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి ఇతర వాహనదారులను, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నూతన చట్టం ప్రకారం డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే.. రూ.10 వేల జరిమానా.. మరియు వారం రోజులు పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. మండల ప్రజలు నూతన సంవత్సరాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.