ఘనంగా బీ.పీ మండల్ వర్ధంతి

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండల కేంద్రంలో వైస్ ఎంపీపీ ఆవుల సత్యం ఆధ్వర్యంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి. పి. మండల్)వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ సందర్బంగా ఆవుల సత్యం మాట్లాడుతూ (ఓ బిసి) రిజర్వేషన్ పితామహుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, దివంగత ప్రజా నాయకుడు 40 ప్రతిపాదనలతో మండల్ నివేదికను పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలని 1990వ సంవత్సరంలో ఆగష్టు 7వ తేది రోజు పార్లమెంట్ లో మండల్ నివేదికను ప్రవేశ పెట్టిన ఓబిసి రిజర్వేషన్ పితామహుడని అయన అన్నారు. దివంగత బిందేశ్వరీ ప్రసాద్ మండల్ ( బి పి మండల్) … అందరివాడు అందరిలో కలిసి మెలిసి ఉండే మనిషి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు .ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు నర్సాపురం రవీందర్, కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కచ్చుకొమురయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గంగాధర నరేష్, యాదవ సంఘం గొల్లపల్లి మాజీ అధ్యక్షులు ఆవుల లచ్చన్న , సంఘం ఉపాధ్యక్షులు సందేవేని సతీశ్ ,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ ,కాలువ కొమురయ్య, కృష్ణ ,కొమల్ల జలంధర్, మల్లయ్య, కన్ను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!