పనికర లో హనుమాన్ నగర సంకీర్తన.

Hanuman Hanuman

పనికర లో హనుమాన్ నగర సంకీర్తన

నెక్కొండ నేటి ధాత్రి:

నెక్కొండ మండలం పనికర లో మంగళవారం ఆంజనేయ స్వామికి విశిష్టమైన రోజుగా భావించి గ్రామంలోని హనుమాన్ మాలాధారులు గ్రామంలో ఉదయం 8 గంటల నుండి నగర సంకీర్తన చేసి గ్రామంలోని అన్ని దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. గురు స్వాములు చాట్ల సారంగం ,సముద్రాల అనిల్ ,ఘనగాని మధు, ల ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధరించిన పత్రిక విలేకరులు కొత్త రవీందర్ రెడ్డి ,దేసూ.లక్ష్మణ్ , లు ఈ శోభ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామంలో 30 నుండి 50 మంది స్వాములు హనుమాన్ దీక్ష తీసుకుంటారని నియమనిష్ఠలతో ఇరు సంధ్యలు చన్నీళ్లస్నానాలు ఆచరించి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీక్ష ఎంతో కష్టమైనదని స్వామి వారి ఆశీస్సులతో ఏ కష్టం లేకుండా కొనసాగుతున్నాదని గురు స్వాములు తెలిపారు. సుమారు 6 గంటల నగర సంకీర్తన పూర్తి చేశారు. అనంతరం పూజారి బూరుగుపల్లి భవిశాస్త్రి ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ఇరుముడులు ఎత్తుకొని స్వాములు స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు .ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు బుర్ర సతీష్, రాచకొండ యాదగిరి, పైండ్ల మధు, మెండే కుమారస్వామి,కోల సతీష్, దామెర కొండ లక్ష్మీనారాయణ, పవన్ , తరుణ్ ,ప్రవీణ్, హరీష్ ,దీక్షిత్ రెడ్డి, రాము, శ్రీకాంత్ ,అభి, స్వామివారి సన్నిధికి వెళ్ళిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!