
Tuvanti Satyanarayana Goud
ఉత్తమ ఎంపీడీవో గా గుర్రం సత్యనారాయణ గౌడ్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుర్రం సత్యనారాయణ గౌడ్ 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఎంపీడీవో గా ఎంపికై ప్రశంస పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా అందుకున్నారు.నిస్వార్ధంగా,నిబద్ధతతో,నియమనిష్ఠలతో తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తున్న ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ కి ఉత్తమ ఎంపీడీవో పురస్కారం లభించడం ఆనందదాయకమనీ తోటి అధికారులు హర్షం వ్యక్తం చేశారు.ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీరుస్తూ తోటి ఉద్యోగులతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నటువంటి సత్యనారాయణ గౌడ్ కి మరెన్నో మంచి ఉన్నత స్థానాన్ని లభించాలని ఆకాంక్షించారు.