BRS Should Clean Sweep Municipal Elections: KCR
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన గూడెం మధుసూదన్ రెడ్డి..
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలి..
క్షేత్రస్థాయిలో పనిచేయండి.. ప్రతి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి..
సిట్ విచారణ అనంతరం ప్రత్యేక భేటీ..
నేటి ధాత్రి, పఠాన్ చేరు:
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం సిట్ విచారణ అనంతరం హైదరాబాదులోని నంది నగర్ లో గల కెసిఆర్ నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలలో స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ జండా ఎగరవేసి క్లీన్ స్వీప్ సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారని గూడెం మధుసూదన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్ద కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో పని చేసి బిఆర్ఎస్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించుకొని వస్తామని గూడెం మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
