బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ.

CC roads

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలో మండేపల్లి గ్రామంలో సిసి రోడ్డు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ. M.G.NREGS. పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులను కేటాయించారు అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి 5 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి ఒక కోటి 75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అట్టినిధులను మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిని గోపి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి ఓబిసి మోర్చా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ బిజెపి నాయకులు గోనెపల్లి శ్రీనివాస్ నే వూరి సురేష్ గుర్రం రంజిత్ రాము బిజెపి పార్టీ సీనియర్ నాయకులు రాజు రామలింగారెడ్డి దుమాల శ్రీకాంత్ వంతడుపులసుధాకర్ సండే వేణి రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!