Shivaji Statue Foundation Ceremony Held
ఛత్రపతి శివాజీ విగ్రహానికి భూమి పూజ, శోభయాత్ర
నిజాంపేట: నేటి ధాత్రి
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి భూమి పూజ , శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివాజీ హిందూ మత స్థాపన కోసం పోరాటం చేసిన మహా యోధుడని కొనియాడారు. శివాజీ సేవలు మాటల్లో చెప్పలేనివని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ దేవరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, వార్డ్ సభ్యులు, చత్రపతి శివాజీ సభ్యులు, గ్రామ పెద్దలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
