హసన్ పర్తి, నేటిధాత్రి
ఈరోజు హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో తుమ్మ గోపి ఇన్స్పెక్టర్ గత ఆరు నెలలుగా విధులు నిర్వహించి బదిలీ పై మట్ట్వాడ కు వెళ్తున్న సందర్భముగా గోపీ కి స్వీట్ తినిపించి శాలువాతో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది . చాతల్ల సదానందం మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ గోపి తమ విధులలో భాగంగా అన్యాయం జరిగిన బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేశారని ప్రజలకి చాల సపోర్ట్ చేసి ఫ్రెండ్లీ పోలీస్ అనిపించుకున్నారని తమకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జోరుక పూల మాజీ సర్పంచ్ పెంబర్తి,బలగాని రవీందర్ మాజీ వార్డు సభ్యులు, చాతల్ల సదానందం స్వేరో, రాష్ట్ర కన్వీనర్ స్వేరోస్ నెట్ వర్క్, పాలుగొన్నారు, ఇక్కడికి ఇన్స్పెక్టర్ గా జె సురేష్ గారు వస్తున్నారన్నారు.