
Greenery is our future....
*పచ్చదనమే మన భవిత….*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
సంగారెడ్డి: జహీరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్లో వనమహోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. “మానవ సేవయే మాధవ సేవ” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు బెజుగం రాజయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.