పంపిణీకి సిద్ధంగా పచ్చిరొట్ట (జీలుగా) విత్తనాలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా రైతులకు అందుబాటులోకి జీలుగ విత్తనాలు తీసుకువచ్చామని జైపూర్ ఏఈఓ కొమురయ్య తెలిపారు.ఈ మేరకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా 60 శాతం సబ్సిడీతో జీలుగా విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 30 కిలోల జీలుగుగా విత్తనాల బస్తాకు రూ.1116 సబ్సిడీ పోను రైతులు మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.జీలుగా విత్తనాలు అవసరమైన రైతులు
పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు
ఆధార్ కార్డు జిరాక్స్
తీసుకొని రైతు సేవ కేంద్రం జైపూర్ నందు సంప్రదించి జీలుగ విత్తనాలు తీసుకోగలరని జైపూర్ ఏఈఓ ఎస్. కొమురయ్య రైతులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *