పెద్దమ్మతల్లి కృపతో ముదిరాజులు ఆర్థికంగా రాణించాలి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు జోరుక సదయ్య
మొగుళ్లపల్లి ఏప్రిల్ 4 నేటి ధాత్రి
మండలంలోని బంగ్లాపల్లె గ్రామంలో. శివుని విగ్రహం తోపాటు పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రోజున వేద పండితులతో. పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో విగ్రహాలను ప్రతిష్టించారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు.
మొగుళ్లపల్లి మండల మాజీ జెడ్పిటిసి జోరుక సాదయ్య పాల్గొని మాట్లాడుతూ.

ముదిరాజులపై ఈశ్వరుని కృప పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని వారి దీవెనలతో. ప్రజలందరూ సుఖ సంతోషాలతో , పాడిపంటలతోపాటు, దేవుని అనుగ్రహంతో గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా యూత్ అధ్యక్షులు ధనుంజయ్, రేగొండ యూత్ అధ్యక్షులు భద్రయ్య, మాది జెడ్పిటిసి మనోహర్రావు, గ్రామ అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్, సంఘం నాయకులు గోనెల సదయ్య, కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు