
GNANODAYA College WelcomGNANODAYA College Welcomes New Studentses New Students
మెట్ పల్లి అక్టోబర్ 14 నేటి ధాత్రి
జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు.
మెట్ పల్లి పట్టణం లోని మనోహర్ గార్డెన్ లో మంగళవారం జ్ఞానోదయ డిగ్రీ పిజీ కళాశాల నూతన విద్యార్థుల స్వాగతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ అధికారి నక్క శ్రీనివాస్ ముఖ్య అతిధి గా విచ్చేసారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరచుకొని. లక్ష్య సాధన దిశగా పని చేయాలనీ సూచించారు.అనంతరం కరస్పాండంట్ ఇల్లేందుల శ్రీనివాస్ మాట్లాడుతూ సమయం పాలనతో చదివి సమాజంలో శక్తులుగా మారాలని ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంకు మెట్ పల్లి ఎస్ ఐ 3 గంగాధర్ అతిధిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్లు జూనియర్లకు ఆదర్శం గా ఉండేట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమం లో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వెంకట్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రాజ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.