రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామిని రథంపై గ్రామ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.