చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశంలో ఒక్కో మతం వారు ఒక్కో పండుగ ఘనంగా జరుపుకుంటారు . కానీ భారత జాతి మొత్తం కులము, మతము, జాతి, లింగబేధం, లేకుండా జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం లభించింది. దేశానికి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని పెద్దలు భావించారు. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయానికి రాజ్యాంగం రూపొందింది. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకున్నప్పటికీ దాన్ని 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది.. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ,ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలో తాశీల్దార్ కె శ్రీనివాస్ మండల పరిషత్ లో ఎంపీడీవో రవీందర్, స్థానిక పోలీస్ స్టేషన్లో , ఎస్సై వెంకటేశ్వర్లు, జాతీయ జెండాలు ఆవిష్కరించారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని ప్రతిభ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి.