హనుమకొండ : నేటిధాత్రి
హన్మకొండ75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాతో కలిసి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు కలెక్టర్ ను కలిసి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు శాలువాలతో సన్మానించారు.
ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ ప్రశంసాపత్రాలు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జి డబ్ల్యూఎంసి కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా , అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎం. ఏ. బారీ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు