ఘనంగా రమాబాయి భీoరావు అంబేద్కర్ జయంతి వేడుకలు

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం పత్తిపాక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది. యువజన సంఘం అధ్యక్షులు కొంగర విజయ్ ప్రకాష్ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.అనంతరం విజయ్ మాట్లాడుతూ భోజన బిడ్డల భవిష్యత్తు కోసం తన బిడ్డలను త్యాగం చేసిన త్యాగమూర్తి మాతా రామాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంతే కాకుండా ఒక జాతి అభివృద్ధి కోసం తన పిల్లలను త్యాగం చేసిన మహా త్యాగశీలి రమాబాయి అన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని తన భుజస్కం దాల పైన వేసుకుని నడిపించిన ధైర్యశాలి రమాబాయి అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం ప్రతి నెల డబ్బులు పంపించి అంబేద్కర్ ను జ్ఞానసూర్యున్ని చేయడంలో రమాబాయి కృషి వర్ణించలేనిదని అన్నారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ విద్యార్ధి సమాఖ్య జిల్లా అధ్యక్షులు నాగుల పవన్ కళ్యాణ్, జిల్లా కార్యదర్శి నాలిక ప్రతాప్, బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్, సంఘము కార్యదర్శి నాలిక శ్రీకాంత్, మొగ్గం నరేష్, కునమళ్ళ సాయి తిలక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *