రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలకు ముఖ్య అతిథిగా విద్యాసంస్థల చైర్ పర్సన్ డాక్టర్ వి.వనజా రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వనజా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే వివిధ సంస్కృతి సంప్రదాయాల కలయిక మన సంప్రదాయాలు మన విద్యార్థులకు తెలియజేయాలని ఉద్దేశంతో పాఠశాలలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి అంటేనే భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు జరుపుకునే పండుగ వీటి గురించి విద్యార్థులు చక్కగా వివరించారు పిండి వంటలు, భోగి మంటలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.