ములుకనూర్ ఎస్.ఆర్.కే పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

పాఠశాలల్లో పండుగలు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం – ప్రిన్సిపాల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి

భీమదేవరపల్లి, నేటిధాత్రి అక్టోబర్ 01 :

దసరా సెలవులు బుధవారం నుంచి ప్రారంభం కానుండడంతో మంగళవారం మండలంలోని ముల్కనూర్ ఎస్.ఆర్.కే స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింపజేశారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆకట్టుకున్నారు. మహిళ ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు. స్కూల్లో స్పీకర్ల సహాయంతో బతుకమ్మ పాటలు పెట్టుకొని ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, పండుగలు మతసామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం అని అన్నారు. పంచభూతాలలో ప్రకృతిని కాపాడి, దైవంగా భావించే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రముఖమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం కవిత, ఉమామహేశ్వరి, శృతి, ఎం. అశ్విని, భీమేశ్వరి, జి. అశ్విని, అస్మా, అభిలాష్, రామకృష్ణ, శోభ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!