బిట్స్ స్కూల్ లో ఘనంగా మిని బతుకమ్మ సంబరాలు

 

నర్సంపేట టౌన్ ,నేటిధాత్రి :

బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బిట్స్ స్కూల్ లో గురువారం మిని
బతకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి.ఈకార్యక్రమానికి ముఖ్య అతథులుగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్. ఏ. రాజేంద్ర
ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ లు హాజరై బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి, పూల యొక్క విశిష్టతను గురించి విద్యార్థులకు తెలియ
జేశారు.బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో ఇష్టంగా, భక్తితో పేరుస్తూ సుఖ సంతోషాలతో
ఉండాలని కోరుకుంటారని అన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైందని అన్నారు. పిల్లలు సంతోషంగా పాటలు పాడుతూ కోలాటాలతో ఆటలు ఆడుతూ సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థినిలు ఇంటి వద్ద పేర్చి తీసుకొచ్చిన బతుకమ్మలను చూసి వారిని అభినందించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల సెక్రేటరి రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.జ్యోతి గౌడ్,సీ.ఎ.వొ సురేష్,ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!