ఘనంగా లక్ష్మీనరసింహస్వామి మహోత్సవాలు

కథలాపూర్,నేటిధాత్రి :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో అత్యంత మహిమగల పుణ్యక్షేత్రం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం స్వామివారి పల్లకి సేవ, మహా అన్నదానం నిర్వహించారు. ఈ దుంపిటాచల క్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే స్వయంభు లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ముక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!